
Supreme Court of India
సంస్కృతాన్ని జాతీయభాషగా చేయాలంటూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అంశాన్ని పరిశీలించడానికి సరైన వేదిక పార్లమెంట్ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుగా తామెందుకు ప్రకటించాలని… పిటిషనర్ అభిప్రాయాలు కొన్నింటిని మేం షేర్ చేసుకోవచ్చు తప్ప దానిపై చర్చించే వేదిక మాత్రం పార్లమెంటేనని అభిప్రాయపడింది. అందుకు రాజ్యాంగసవరణ అవసరం అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అన్ని భాషలకు మూలం సంస్కృతం అని..ఇతర భాషలన్నీ అందులోంచి ఉద్భవించినవేనని..అందువల్ల సంస్కృతాన్నిజాతీయభాషగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్ స్వీకరించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం… ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన పెట్టాలని ఆ స్వేచ్ఛ పిటిషనర్ కు ఉందని అంది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, న్యాయవాది కేజీ వంజారా జాతీయ భాషగా సంస్కృతాన్ని నోటిఫై చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు.