పొగతాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. .మీరు ప్రచారం కోరుకుంటే మంచి కేసువాదించిండం తప్ప పిల్ ఫైల్ చేయకండి అంటూ పిటిషన్ వేసిన న్యాయవాదులు సుభా అవస్థి, సప్త రిషి మిక్రాకి సూచించింది. ధూమపానాన్ని అదుపు చేసేందుకు నియమనిబంధనలు విధించాలని న్యాయవాదులు పిటిషన్ లో కోరారు. విచారణ జరిపిన ఎస్కే కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ తోసిపుచ్చింది.
వాణిజ్య ప్రాంతాల వద్ద స్మోకింగ్ జోన్లను తొలగించాలని, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, ఆరాధానా స్థలాల వద్ద లూజ్ సిగరెట్ సేల్స్ను నిషేధిస్తూ ఆదేశాలివ్వాలని పిటిషనర్లు తమ పిల్లో కోర్టును కోరారు.అటు
లూజ్ సిగరెట్లపై నిషేధానికి విముఖత వ్యక్తం చేసింది కోర్టు.