వివేకానంద హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదాపడింది. కోర్టు సమయం మించిపోవడంతో గురువారానికి విచారణకు సుప్రీం వాయిదా వేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. కేసువిచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ఎఫ్ నేతృత్వంలోని కోర్టు తెలిపింది. కోర్టు సమయం అయిపోవడంతో… న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఎల్లుండి విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ ఎం ఆర్ షా తెలిపారు.