కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు వారణాసిలోని కోర్టు నియమించిన కమిషన్ నివేదికను సమర్పించింది. మే 14 నుంచి 16 వరకు నిర్వహించిన సర్వే పనుల నివేదికను జిల్లా కోర్టులో సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ కు ప్రత్యేక అడ్వకేట్ కమిషనర్ విశాల్ సింగ్ సమర్పించారు. ఈ కేసులో హిందువుల తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. అలాగే అడ్వొకేట్ కమిషనర్గా కోర్టు తొలగించిన అజయ్ మిశ్రా.. మే 6, 7 తేదీల్లో తాను నిర్వహించిన సర్వేపై బుధవారం సాయంత్రం నివేదిక సమర్పించారని యాదవ్ తెలిపారు.
మే 17న మిశ్రాను తొలగించిన తర్వాత, ప్రత్యేక అడ్వకేట్ కమిషనర్గా విశాల్ సింగ్ను, అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్గా అజయ్ ప్రతాప్ సింగ్ను కోర్టు నియమించింది.
ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు విచారణను కొనసాగించవద్దని వారణాసిలోని సివిల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. హిందూ పక్షం తరఫు న్యాయవాది…. వాయిదా వేయాలని కోరడంతో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.విష్ణు శంకర్ జైన్ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది, అయితే ట్రయల్ కోర్టు ఈరోజు విచారణ జరపకూడదని లేదా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని ఆదేశించింది.
“ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగకూడదని పిటిషనర్లు కోరారు. దీంతో జైన్ అంగీకరించారు. మేం ట్రయల్ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేసిన విధంగా కచ్చితంగా వ్యవహరించాలని నిర్దేశిస్తాం.. ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండవలసి ఉంటుంది” అని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.