బీబీసీ డాక్యుమెంటరీ వివాదం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది.’ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే పేరుతో 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం సృష్టించింది. కేంద్రం ఈ డాక్యుమెంటరీని, ఇందుకు సంబంధించిన లింకులను భారత్లో బ్లాక్ చేసింది. ఈ డాక్యుమెంటరీ తప్పుదారి పట్టంచే విధంగాను, కుట్రపూరితంగానూ ఉందని, రాజ్యంగవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకెళ్లారు.
https://twitter.com/ANI/status/1621405506047983622?s=20&t=6Q5vdBWN6I132pTYy9YDmg