శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులైన మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు… మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన సోదరులిద్దరూ జూలై 28 వరకు దేశం విడిచి వెళ్ళకూడదని ఆదేశించింది. మహింద, బసిల్లపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఈ ఆదేశాలు జారీచేసింది కోర్టు.
అటు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణస్వీకారం చేశారు.గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు.
అటు గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్టు స్పీకర్ మహింద యాప ఆబేయవర్థనె ప్రకటించారు.అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నికోనున్నారు.
https://twitter.com/ANI/status/1547904623448817665?s=20&t=GaaSxPjGMV9Df5rMywN6kw