
Supreme Court of India
2002 గుజరాత్ అల్లర్లు, 1992 నాటి బాబ్రీ కట్టడం కూల్చివేత ఘటనలకు సబంధించి అన్ని పెండింగ్ కేసులను క్లోజ్ చేసింది సుప్రీం కోర్టు. అందులో భాగంగా… యూపీ మాజీ సీఎం, దివంగత కల్యాణ్ సింగ్ పై ఉన్న కేసునూ ముగించింది.
2002లో గోద్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో పెద్దఎత్తున అల్లర్లు రేగిన సంగతి తెలిసందే. అలాగే రామజన్మభూమిలోని బాబ్రీ కట్టడాన్ని 1992లో కరసేవలు కూల్చివేశారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ యూపీ ప్రభుత్వం, అధికారులపై నమోదైన కేసులను సుప్రీం ధర్మాసనం క్లోస్ చేసింది. 2019లో అయోధ్య రామజన్మభూమిపై సుప్రీం కోర్టు తుదితీర్పునివ్వడంతో దానికి సంబంధించి ఇతర కేసులను మూసివేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
https://twitter.com/ANI/status/1564498007814733824?s=20&t=i3xnEsWp9XCJqgfPyXY5TQ