చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు ఎస్పీనేత ఆజంఖాన్. ఖాన్ కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా) నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ సహా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు అజాం ఖాన్ కు ఘన స్వాగతం పలికారు. ఖాన్ విడుదలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆనందం వ్యక్తంచేశారు.
విడుదల ఆర్డర్ రాత్రి 11 గంటలకు అందిందని సీతాపూర్ జైలు జైలర్ ఆర్.ఎస్. యాదవ్ తెలిపారు.నిబంధనలమేరకు ఉదయం 8 గంటలకు విడుదల ఆజంను విడుదవచేసినట్టు తెలిపారు.జైలు నుంచి రాంపూర్ బయలుదేరే ముందు మాజీ SP ఎమ్మెల్యే అనూప్ గుప్తా ఇంటికి వెళ్లారు ఆజం ఖాన్. గుప్తా సీతాపూర్ జైలులో ఉన్నప్పటి నుంచి ఖాన్తో నిరంతరం టచ్లో ఉన్నారు. గుప్తా ఇంట్లో తన 45 నిమిషాలు గడిపారు. అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న మద్దతుదారులు, శ్రేయోభిలాషులను కలిశారు. అటునుంచి రాంపూర్ వెళ్లారు.
సుప్రీంకోర్టు గురువారం ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ ఎస్పీ నాయకుడిని విడుదల చేయాలని కోరుతూ స్థానిక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు గురువారం అర్థరాత్రి సీతాపూర్ జైలు పాలకమండలికి లేఖ పంపింది. భూకబ్జా సహా పలు కేసుల్లో ఖాన్ గత 27 నెలలుగా జైలులో ఉన్నారు.