2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం. నేరం రుజువైనందున దోషి పిటిషన్ ను జస్టిస్ బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఎర్రకోట దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా ముగ్గురు మరణించారు. 2011 ఆగస్టులో ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అయితే 2016లో ఆయన రివ్యూ పిటిషన్ను మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2005నవంబర్ నెలలో ట్రయల్ కోర్టు ఆరిఫ్కు మరణశిక్ష విధించింది. 2007లో ఢిల్లీ హైకోర్టు ఆరిఫ్కు మరణశిక్షను సమర్థించింది.
https://twitter.com/PTI_News/status/1588041514323955712?s=20&t=-OK197KVU2DVR9utZyIA7g