కర్నాటకలో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు అస్పష్ట తీర్పును ఇచ్చింది. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా..మరొకరు విద్యార్థుల చదువుకే ప్రధాన్యత ఇవ్వాలని అన్నారు. గతంలో ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పు ఇచ్చింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా…విద్యార్థుల చదువుకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జస్టిస్ సుధాంశు ధలియా తీర్పునిచ్చారు. తుది తీర్పుకోసం సీజేఏ ధర్మాసనానికి కేసును సిఫార్సు చేస్తున్నట్టు హేమంత్ గుప్తా తెలిపారు.
ఇక విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో కర్ణాటకలో హిజాబ్ ధారణపై నిషేధం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ (BC Nagesh) మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులు, మహిళలు హిజాబ్ ధరించడంపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు మెరుగైన తీర్పు ఇస్తుందని తాము ఆశించామని… అయితే ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
https://twitter.com/LiveLawIndia/status/1580426234978525185?s=20&t=UEJeakpb-un7w3NUHqCF5w