అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే వచ్చేవారం వాదనలు వింటామని తెలిపింది. దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని… 70వేల మందికి పైగా యువత అపాయింట్ మెంట్ లెటర్ కోసం ఎదురుచూస్తున్నారని.. పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వచ్చే వారం ఇచ్చే తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.