కర్నాటక విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై కర్నాటక హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది అత్యున్నత సుప్రీం ధర్మాసనం. స్పందన తెలియజేయాలంటూ కర్నాటక ప్రభుత్వానికి నోటీసులు సైతం జారీచేసింది. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఆ వ్యవహారంలో దాఖలైన మొత్తం 23 పిటిషన్లను స్వీకరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.
హిజాబ్ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తప్పనిసరైన మతాచారం కాదంటూ…కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పలువురు ముస్లిం విద్యార్థినులు సుప్రీంకు వెళ్లారు.
ఇక ఈసందర్భంగా వాయిదా కోరిన పిటిషన్లపై మండిపడింది సుప్రీం. ఇలాంటి ఫోరం షాపింగ్ ను అనుమతించబోమంది.
జూలై 13న, పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. హిజాబ్ ధరించాలనుకునే విద్యార్థినులు చదువులో వెనుకబడేలా నిషేధం కారణమవుతుందని భూషణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.
https://twitter.com/ANI/status/1564122953121312768?s=20&t=ywboLSGW1H–k8MRMKKLog