పత్తి రైతులకు మద్దతు గ్యారంటీ: దటీజ్ మోడీ
ఢిల్లీ శివార్లలో పంజాబ్ నుంచి వచ్చిన కొందరు ఆందోళన పేరుతో హైవేలమీద తిష్ట వేశారు. వాళ్లలో రైతులు ఎందరు, కమీషన్ ఏజెంట్లు పంపిన మనుషులు ఎందరు అనే చర్చ జరుగుతోంది. మరోవైపు, అదే పంజాబ్ లోని రైతులు పండించిన పత్తిని మోడీ ప్రభుత్వం కనీసం మద్దతు ధర (ఎంఎస్ పి)కే కొంటున్నది. అక్టోబర్ 1 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5.30 లక్షల బేళ్ల ముడి పత్తిని మద్దతు ధరకే సేకరించింది.
అంతే కాదు, దేశ వ్యాప్తంగా పండిన పత్తిలో ఇప్పటి వరకు 20 శాతం సేకరణ పూర్తయింది. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర ప్రకారం మోడీ ప్రభుత్వం చెల్లించింది. ఇంకా సేకరణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 14.82 లక్షల మంది పత్తి రైతుల నుంచి కేంద్రం రా కాటన్ సేకరించింది. కొత్త చట్టాలు వచ్చినా కనీస మద్దతు ధర పోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పారు. ఆ ప్రకారమే పత్తి సేకరణ జరుగుతోంది. కొన్ని ప్రతిపక్షాలు అబద్ధాలతో రైతులను మాయచేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా, 27 రాష్ట్రాల్లోని రైతుల ఈ అసత్యాలను నమ్మడం లేదు. పంజాబ్ లోని కొందరు రైతులు మాత్రమే ఈ మాయలో పడినట్టు కనిపిస్తున్నది.