భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బాసటగా నిలిచింది. భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసిన చైనా తీరును ఆ దేశం తప్పుపట్టింది. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్ తీసుకున్న చర్యల్ని సమర్థిస్తూ మద్దతు ప్రకటించింది. అమెరికాలోని రక్షణ శాఖ కేంద్ర పెంటగాన్, అమెరికా విదేశాంగ శాఖ సైతం యాంగ్జే వద్ద చైనా-భారత్ దళాల ఘర్షణపై ఘాటుగా స్పందించాయి. ”భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను గమనిస్తున్నాం. చైనా మౌలిక వసతుల నిర్మాణాలు చేస్తూ అంతటా దళాలు మోహరిస్తోంది. ఇండో పసిఫిక్లోని మా మిత్రులు, భాగస్వాములను కవ్వించడమేనని అర్థమవుతోంది. మా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలకు రక్షణగా మేం ఉంటాం. తాజాగా ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నాం” అని ప ఆదేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గతంలో ఇలాగే గల్వాన్లో 20 మంది భారత సైనికులు, 40 మంది చైనా సైనికులు మరణించిన ఘటనను భారతదేశ ప్రజలు మరచిపోకముందే మరోసారి 400 మంది సైనికులతో మన దేశ చెక్పోస్టును ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఇనుప ముళ్ల కంచెలు చుట్టిన కర్రలు, టీజర్ గన్లతో మన దేశ చెక్పోస్టును ఆక్రమించే ప్రయత్నానికి దిగింది. అక్కడి భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్న భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. కొద్ది సమయంలోనే అదనపు బలగాలు రావడం, ఎదురుదాడికి దిగడంతో చైనా బలగాలు తోకముడిచాయి.
https://twitter.com/ANI/status/1602855535979954177?s=20&t=24HMdt1bw4gj-JzSkGRl7g