భారత్ లో దాడికి సిద్ధపడి…నియంత్రణ రేఖనుంచి దేశంలోకి చొరబడుతున్న వ్యక్తిని సైన్యం అరెస్ట్ చేసింది. రాజౌరి జిల్లానుంచి కొందరు తీవ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిఘావర్గాల హెచ్చరికలతో సైన్యం అప్రమత్తమైంది.రెండుచోట్ల ల్యాండ్ మైన్ పేలుడులో పాకిస్తాన్ ఉగ్రవాది పట్టుబట్టాడు. మరో ఇద్దరు
హతమయ్యారు. పట్టుబడిన వ్యక్తి – గతంలో నియంత్రణ రేఖ దాటినందుకు అరెస్టై మానవతాకారణాలతో విడుదలయ్యాడు. గాయపడిన అతనికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. భారత పోస్ట్పై దాడి చేస్తే 30 వేలు ఇస్తానని పాక్ సైన్యానికి చెందిన ఓ కల్నల్ ఆవ్యక్తిని పంపినట్టు విచారణలో అంగీకరించాడు ఆ ఉగ్రవాది.
అతడిని పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లి జిల్లాలోని సబ్కోట్ గ్రామ నివాసి తబారక్ హుస్సేన్గా గుర్తించారు.విచారణలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌదరి తనను పంపాడని…అందుకు ఆయన ఇచ్చిన 30 వేల రూపాయలు తనదగ్గరే ఉన్నాయని తెలిపారు. హుస్సేన్ తాను భారతీయుల ఫార్వార్డ్ను నిర్వహించే స్క్వాడ్లో భాగమని, ఆగస్ట్ 21న ఫైనల్ గో-అహెడ్ పొందనట్టు ఒప్పుకున్నాడని సైన్యం తెలిపింది. కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులనుంచి AK-56 రైఫిల్తో పాటు బుల్లెట్లు, రేషన్ను స్వాధీనం చేసుకున్నారు.
J&K | He had bled out due to 2 bullet wounds in his thigh & shoulder, was critical. Members of our team gave him 3 bottles of blood, operated him & put him in the ICU. He is stable now but will take a few weeks to improve: Brigadier Rajeev Nair on fidayeen Tabarak Hussain https://t.co/YGe2lP7JdO pic.twitter.com/qrkKRrenzA
— ANI (@ANI) August 24, 2022