
Arif Mohammad Khan(Left) Sunni leader Abdul Hameed Faizi Ambalakkadavu(Right)
శబరిమల ఆలయాన్ని దర్శించి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఇస్లామిస్టులు. బీజేపీలో ఉన్న పదవులపై ఆశతోనే ఆయన ఇస్లాంకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని… సున్నీ నాయకుడు ఫైజీ అంబలక్కడవు అన్నారు. ఆరిఫ్ ఖాన్ అచ్చంగా హిందువుల ఆచారాలను పాటించారని… శబరిమల ఆలయానికి వెళ్లడం. అక్కడ పూజలు చేయడం అందరూ చూశారని..అంటే ఆయన ఇస్లాంనుంచిదూరంగా వెళ్తున్నట్టున్నారనీ అన్నారు.
గవర్నర్ పేరు వింటే ముస్లిం అని తెలుస్తుంది. అతని పేరులో మహ్మద్ ప్రవక్త పేరు ఉంది. ఆరిఫ్ అంటే అల్లాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు.హిజాబ్ వ్యవహారంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల్నీ ఆయన తప్పుబట్టారు.
హిజాబ్ ఉద్యమాన్ని ఆయన కేరళ గవర్నర్ వ్యతిరేకించారు. హిజాబ్ హక్కు అని ముస్లిం మహిళలు భావిస్తే నష్టపోతారని, హిజాబ్ అంశాన్ని కాంగ్రెస్, సహా పలు పార్టీలు స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనీ ఆరిఫ్ మహ్మద్ అన్నారు.
గవర్నర్ మీద ఇంకా తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఫైజీ. ఒక ముస్లిం ఇతరమతాల ప్రార్థనాస్థలాల్ని సందర్శించినా, వారి ఆచరాలు పాటించినా వారి సంప్రదాయ దుస్తులు ధరించినా అతను ఇస్లాంకు దూరమైనట్టే. ఇస్లాంను అపహాస్యం చేసినట్టే అని అన్నారు. ఇస్లాం ప్రాథమిక సిద్ధాంతాల్ని ప్రశ్నించినా సరే అతను మతానికి దూరమైనట్టేనని అన్నారు. అయితే ఆరిఫ్ మహ్మద్ ముస్లింకాదని తాను అననని..ఫత్వా జారీచేయడానికి తానేం మత పెద్దను కాదనీ అంటూనే…ఇస్లాం విధానాలను మాత్రమే తాను చెప్తున్నానన్నాడు.