గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ భారత్ వచ్చారు. సోమవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ఆయన,…ఇవాళ విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ డిజిటల్ ట్రాన్్ ఫర్మేషన్ సహా పలు అంశాలపై చర్చించనట్టు జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మోదీతో భేటీ అనంతరం పిచయ్ ట్వీట్ చేస్తూ… ఇన్నోవేషన్, తదితర అంశాలపై మోదీతో మాట్లాడానని… ప్రధానితో భేటీ సంతృప్తినిచ్చిందని అన్నారు. మోదీ నాయకత్వంలో అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు అమల్లోకి వస్తుండటం గొప్ప ప్రేరణనిస్తోందన్నారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత దేశ జీ20 ప్రెసిడెన్సీకి సహకరిస్తామన్నారు.
https://twitter.com/DrSJaishankar/status/1605104666274312192?s=20&t=k_oVQ0_NhZ_BsUSDbfVwGw