నిజాయతీ, సేవాగుణాన్ని అణువణువునా నింపుకుని ఎందరి మన్ననలో పొందిన సుల్తాన్ బబార్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ (DI )లక్ష్మణ్ రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఉదయం సొంతూరు సూర్యాపేటనుంచి తీసుకుని హైదరాబాద్ వస్తుండగా… అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర వీరి కారు ఆగిఉన్న లారీని ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణ్ తో పాటు… ఆయన సతీమణి ఝాన్సీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారి ఆరేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుమీద వెళ్తున్న వాహనాలను ఆపుతూ మా మమ్మీడాడీకి యాక్సిడెంట్ అయింది రండీ అంటూ అర్థించడం అందర్నీ కదిలించింది. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ లో డ్యూటీ చేస్తూనే స్వచ్ఛంద సంస్థలకు సేవా కార్యక్రమాల్లో సహకారం అందించాడు.