హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ పేరును ప్రకటించింది కాంగ్రెస్. సీఎం పదివికి ఆశించిన వారు చాలామందే ఉన్నా…ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపించాయి. చివరకు సుఖ్వీందర్ పేరును ఖరారు చేసింది హైకమాండ్. పీసీసీ చీఫ్, దివంగత నేతవీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభాసింగ్, తనయుడు విక్రమాదిత్యలు కూడా సీఎం పదవిని ఆశించారు. ఆ కుటుంబానికే ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రియాంకగాంధీకి విజ్ఞప్తులు కూడా చేశారు . కానీ చివరకు సుఖ్వీందర్ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించింది.