పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం కారు పేలడంతో ముగ్గురు చైనీస్ పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారు, పలువురు గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలోని వ్యాన్లో పేలుడు జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
#BREAKING: 4 Chinese national died in a blast in a vehicle inside Karachi university. pic.twitter.com/7XCBRLRAwO
— Asad Ali Toor (@AsadAToor) April 26, 2022
కరాచీ పోలీసు చీఫ్ గులాం నబీ మెమన్ మాట్లాడుతూ, ప్రాథమిక దర్యాప్తుల్లో ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని సూచిస్తున్నట్లు తెలిపారు. నిందితురాలు సైట్ లో బురఖా ధరించి వ్యాన్ వరకు వెళుతున్నట్లు, వ్యాన్ ఆమె దగ్గరికి వెళ్లిన తక్షణమే పేలుడు సంభవించిందని అతను చెప్పాడు.
https://twitter.com/Roohan_Ahmed/status/1518919889511141381?s=20&t=XNu8_bFRo9L3a-hdaAtCEg
చనిపోయిన ముగ్గురు చైనీస్లో చైనీస్ భాషా గ్రాడ్యుయేట్ తరగతులను అందించే కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. నాల్గవ వ్యక్తి పాకిస్థానీ వ్యాన్ డ్రైవర్ అని అధికారులు తెలిపారు.
ఈ దాడి వెనుక మహిళా ఆత్మాహుతి బాంబర్ హస్తం ఉందని పాకిస్తాన్ వేర్పాటువాద బృందం తెలిపింది. దాడికి బాధ్యులం మేమేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. “బలూచ్ లిబరేషన్ ఆర్మీ” కరాచీలో చైనీస్ జాతీయులపై జరిగిన ఆత్మాహుతి దాడికి బాధ్యత వహించింది,” అని గ్రూప్ ప్రతినిధి జీయాంద్ బలోచ్ టెలిగ్రామ్కు ప్రకటనలో తెలిపారు, ఇది ఒక మహిళా మిలిటెంట్ ద్వారా మొదటి BLA మిషన్ అని అన్నారు. జూలై 2021లో వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద బస్సుపై బాంబు దాడి చేసి తొమ్మిది మంది చైనీస్ జాతీయులను చంపిన తర్వాత పాకిస్తాన్లో చైనా జాతీయులపై జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే.
కరాచీ యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్, చైనీస్ భాషా బోధనా కేంద్రం సమీపంలోని వ్యాన్లో మధ్యాహ్నం 1.52 గంటలకు పేలుడు జరిగింది. పేలుడు తరువాత, రెస్క్యూ, భద్రతా సంస్థలు ప్రదేశానికి చేరుకుని, ఆ ప్రాంతాలను చుట్టుముట్టాయి. రెస్క్యూ టీం కార్యకలాపాలను ప్రారంభించినట్లు జియో న్యూస్ తెలిపింది.
ఘటనా స్థలానికి వెంటనే చేరుకోవాలని సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఉగ్రవాద నిరోధక శాఖను ఆదేశించినట్లు సమాచారం.
పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్, అలీ షాతో టెలిఫోన్ కాల్లో విచారం వ్యక్తం చేశారు. అటువంటి సంఘటనలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందని షాకు ప్రధాని హామీ ఇచ్చారని అక్కడి మీడియా తెలిపింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)