సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా ఆదిలాబాద్ స్టేడియంలో నిరుద్యోగ యువత తో selfie తీసుకున్నట్టు బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతీ యువకులతో ఫొటోలు దిగి కేటీఆర్, కెసిఆర్ లను టాగ్ చేస్తూ సోషల్మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో ఉద్యోగాలు… త్వరలో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను ఊరిస్తున్నారు తప్ప ఒక్క ఉద్యోగం ఇచ్చిందిలేదని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వాలని, 2018 లో ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల తో సెల్ఫీలు తీసుకున్నారు సుహాసినీ రెడ్డి.
తెలంగాణ కోసం బలిదానాలు చేసిన యువత, రాష్ట్రం సాధించుకున్న తరువాత కూడా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని… ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)