………
ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. పాకిస్తాన్ గడ్డమీద ఎంపిక చేసిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. 100 మందికి పైగా టెర్రరిస్టుల్ని పరలోకానికి పార్సెల్ చేసేసింది. సామాన్య జనం, పబ్లిక్ వ్యవస్థలకు ఎటువంటి డ్యామేజీ లేకుండా ..నేరుగా ఉగ్రవాద స్థావరాలని సంపూర్ణంగా నాశనం చేసింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ శభాష్ అన్నాయి తప్పితే,, ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు.
…….
ఇక్కడ మనకి కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఒకటి పాకిస్తాన్ గడ్డమీద ఏ మూల స్థావరాలు అయినా మనం నాశనం చేసేయగలం. ఎంచుకున్న లక్ష్యాల్ని సూటిగా స్పష్టంగా సర్వనాశనం చేయడం మన సైన్యం గొప్పతనం. ఆధునిక టెక్నాలజీ, బలమైన నైపుణ్యం, పటిష్టమైన సాధన సంపత్తితో … ఈ విజయం సాధ్యమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ మన మీదకు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు, బాంబులను ఆకాశంలోనే పేల్చేసి శత్రువుకి భయంకరమైన ఛాలెంజ్ విసిరాము. దీంతో పాకిస్తాను తప్పనిసరిగా కాళ్ళ బేరానికి వచ్చింది.
……..
మరోవైపు ప్రపంచ దేశాలకు భారతదేశ సైనిక పటిమ తెల్సి వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన బలమైన ఆయుధ సంపత్తి గురించి ప్రపంచం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. భారతదేశం దగ్గర మేలురకం ఆయుధ సంపత్తి ఉంది అని ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. నిజానికి ఇటువంటి ఆయుధ సంపత్తిని భారతదేశం కొంతకాలంగా ఇతర దేశాలకు అమ్ముతున్నది కూడా. దీని ద్వారా బోలెడు ఆదాయం మరియు ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతోంది.
……..
ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆయన టీం దూరదృష్టి తోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చుకుంటే … ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ రంగ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి.
2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.686 కోట్లుగా భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు ఉండేవి. పదేళ్ల నరేంద్ర మోడీ పాలన తర్వాత..
2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.23,622 కోట్లకు చేరాయి. అంటే గత పదేళ్లలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 34 రెట్లు పెరిగాయి.
…..
భారత్ ప్రస్తుతం దాదాపు 80కిపైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల తో పాటు మేలురకం ప్రైవేటు కంపెనీలు కూడా ఈ ఎగుమతులు చేయగలుగు తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం కొద్దీ ఈ ఉత్పత్తులని విరివిగా కొంటున్నారు. దీంతో 2029 నాటికి 50 వేల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ను భారత రక్షణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
………
భారత్లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, కచ్చితత్వం, శక్తియుక్తులపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడింది. అందువల్లే అవి భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదేపదే ఆర్డర్లు ఇస్తున్నాయి. పర్యవసానంగా గత పదేళ్లలో భారత రక్షణరంగ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి సాధ్యమైంది. మరోవైపు ఈ ఎగుమతులు అన్నీ పూర్తిగా ప్రభుత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. దొంగ దారులు, అక్రమాయుధాలు, స్మగ్లింగ్ మార్గాలను భారత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. భారత భూభాగం మీద నక్సలిజం వంటి తీవ్రవాద సంస్థల్ని నిర్మూలించడం ద్వారా భారత్ పటిష్ట చర్యలు తీసుకోగలిగింది.
…..
‘ఆపరేషన్ సిందూర్’ పుణ్యమా అని ప్రపంచ దేశాలకు భారత సత్తా మరోసారి తెలిసి వచ్చింది. దీంతో భారతదేశ లో తయారైన ఆయుధాలు టెక్నాలజీ పరికరాలకు విపరీతంగా డిమాండ్ వచ్చింది. శత్రువు మీద దాడి చేయడం ఒక ఎత్తు అయితే శత్రు దాడులని ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ మాదిరిగా రెండు రకాల ఆయుధ సంపత్తిని భారతదేశం తయారు చేసుకుంటుంది అసలైన ఆత్మ నిర్భర్ భారత్ ను రక్షణ రంగంలో చాటి చెప్పగలిగింది.
…………
మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశానికి ఎన్నెన్నో లాభాలు వచ్చి పడ్డాయి. పూర్తిస్థాయి యుద్ధం చేసి డబ్బుని ఖర్చు పెట్టకుండానే,, కొద్దిపాటి దాడుల ద్వారా శత్రువుని లొంగదీసుకున్నారు ప్రపంచ దేశాలకు మన సత్తాను చాటి చెప్పారు,, శభాష్ మోదీజీ..!!