ఇండోనేషియాలో 53 సిబ్బందితో కూడిన సబ్ మెరైన్ గల్లంతైంది. సబ్మెరైన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా కేఆర్ఐ నంగాల 402 సబ్మెరైన్ సముద్రంలో గల్లంతైందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. బాలి దీవి ఉత్తర తీరం నుంచి నీటిపై 95 కిలోమీటర్ల దూరం వెళ్లాక దాన్నుంచి సిగ్నల్ ఆగిపోయింది.
సిగ్నల్స్ మొత్తంగా బ్లాక్ కావడంతో మునిగిపోయినట్లు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మెరైన్ ఆచూకీ తెలుసుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా సాయం తీసుకుంటున్నారు. ఇండోనేషియా మీడియా కథనాలను బట్టి…
సముద్ర మట్టం నుంచి 2 వేల 300 అడుగుల లోతులో అది మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఓ చోట ఆయిల్ లీకైన జాడను హెలికాఫ్టర్ గుర్తించింది. ఆయిల్ లీక్ వల్లే మెరైన్ పూర్తిగా మునిగిఉండవచ్చునని అనుమానిస్తున్నారు.