జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారి డ్యూటీలో ఉండగానే హత్యకు గురయ్యారు. పశువులను స్మగ్లింగ్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. మరణించిన అధికారిని తూపుదాన ఓపీ ఇన్ఛార్జ్ ఎస్ఐ సంధ్య టోప్నోగా గుర్తించారు. ఎస్ఐ సంధ్య జంతువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని వెంబడించారు. అందులో అక్రమంగా జంతువులను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే గుర్తు తెలియని నిందితులు వాహనాన్ని ఎస్ఐకి ఎదురుగా నడిపి ఆమెను హత్య చేశారు.
సబ్ఇన్స్పెక్టర్ సంధ్యను వెంటనే రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు.
రాంచీ SSP జరిగిన సంఘటన గురించి తెలియజేసారు. రాంచీ పోలీసులు నిందితులను పట్టుకున్నారని.. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
One more person was present inside the vehicle, for whom a continuous search is on. Efforts will be to complete the investigation quickly & get the guilty punished with a speedy trial. Accused, namely Nigaar Khan tried to breach govt works as well: Ranchi SSP Kishore Kaushal pic.twitter.com/vwoDrB4EID
— ANI (@ANI) July 20, 2022