మన తెలంగాణ లో కొన్ని చోట్ల పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చొరవ చూపిస్తున్నారు. పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం లో ఉత్సాహం చూపిస్తున్నారు . అటువంటి విద్యార్థులకు అధ్యాపకులు తోడైతే పచ్చదనం సాకారం అవుతోంది.
తాజాగా బజార్ హత్నూర్ మండల కేంద్రం లోని జవహర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది, జాతీయ సేవా పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ విద్యా సంవత్సరంలో సుమారుగా 1000 మొక్కల నాటడం జరుగుతుందని కరస్పాండెంట్ స్వర్ణలత తెలియజేశారు. ప్రిన్సిపాల్ గిరిజాపతి మాట్లడుతూ పర్యావరణ పరిరక్షణ లో మొక్కల ప్రాధాన్యత చాలా ఉంది అని , పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది అని పేర్కొన్నారు.ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సదానందం మాట్లాడుతూ మొక్కలు నాటడం శుభపరిణామమని ,, ఇలాంటి కార్యక్రమములో భాగస్వామ్యం అవుతున్న విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.