నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బిక్షమెత్తారు. రెండు రోజులుగా మెస్ వర్కర్స్ పని చేయకపోవడంతో, విద్యార్థులు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. నిన్న వీసీ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించినా ఈరోజు కూడా వాళ్లకి తిండి దొరకలేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం ధర్నా చేపట్టడంతో… విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో వారంతా ఆందోళన కు దిగారు. ఖాళీ ప్లేట్లతో యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఎండలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న నడిపెల్లి తండాలో బిక్షాటన చేశారు. అన్నం తెచ్చుకుని యూనివర్సిటీ గెట్ ఎదుట కిందే కూర్చుని తిన్నారు. ప్రభుత్వం వెంటనే తమకు ఆహారం అందేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.