ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు హడావుడి పెరిగిపోయింది. దురదృష్టవశాత్తు ఈ ట్రాప్ లో బిజెపి శ్రేణులు కూడా పడుతున్నాయి. నరేంద్ర మోడీ హవా తగ్గిపోయిందని, చాలాచోట్ల బిజెపి సీట్లు కోల్పోయిందని, బిజెపి ఓటమి అంచున నిలిచిందని ప్రచారం చేస్తున్నారు. మిత్రపక్షాల దయాదాక్షిన్యాలతోటే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, లేనిపక్షంలో బిజెపి పని అంతే సంగతులు అని సోషల్ మీడియాలో మూత మోగిస్తున్నారు.
నిజానికి ఈసారి ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు బలమైన పాత్ర పోషించాయి. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటి మీదకు రావడం వల్ల ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్ర వంటి చోట్ల ఎంపీ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అదే సమీకరణాలతో ఆంధ్రప్రదేశ్ బీహార్ వంటి చోట్ల మిత్రపక్షాలతో కలిసి బిజెపి పై చేయి సాధించింది. అటువంటి అప్పుడు ఎన్డీఏ కూడా మీ గెలుపు కచ్చితంగా బిజెపి నాయకత్వం ప్రతిభ వల్లే అని అర్థం అవుతుంది. మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకే బిజెపితో పాటు మిత్ర పక్షాలకు ప్రజలు ఓటేశారు.
అయినప్పటికీ గొంతులు చించుకుంటున్న కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కొన్ని ప్రశ్నలు సంధిద్దాం. బురద జల్లుడు మేధావులను సుత్తి లేకుండా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదాం.
ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్లయితే బిజెపి గెలిచిందా లేక ఓడిందా అన్నది స్పష్టంగా అర్థం అయిపోతుంది.
1)) మూడవసారి కూడా పాజిటివ్ ఓటుతో తనకు 240 సీట్లే వచ్చినప్పటికీ ,, తోటి మద్దతుదారులకు 54 స్థానాలలో గెలుపు సుసాధ్యం చేయటం గెలుపా ఓటమా..?
2)) అరుణాచల్ ప్రదేశ్ లో మూడవసారి కూడా గెలిచి అధికారంలోకి రావటము బిజెపికి గెలుపా.. ఓటమా..?
3)) ఒరిస్సాలో 20 కు 19 ఎంపీ స్థానాలు గెలిచి, ఒరిస్సాలో తొలిసారిగా అధికారంలోకి వచ్చి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయగలగటం గెలుపా ఓటమా..?
4)) కమ్యూనిస్టుల ఏలుబడిలో ముస్లిం క్రైస్తవ వర్గాలు.. బలీయమైన కేరళలో తొలిసారి ఒక ఎంపీ స్థానం గెలవటం గెలుపా ఓటమా..?
5)) ఆమ్ ఆద్మీ పార్టీ ఏలుబడిలో ఉన్న డిల్లిలో ఉన్న మొత్తం 7 స్థానాలకు 7 స్థానాలు.. అలాగే కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 4 స్థానాలకు 4 స్థానాలు కైవసం చేసుకోవటం గెలుపా ఓటమా..?
6)) కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ కన్నా రెండు రెట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకోవటం గెలుపా ఓటమా..?
7)) ఇటీవలనే తెలంగాణలో అధికారంలోకి వచ్చి,, మంచి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ తో సమానంగా 8 స్థానాలు గెలిచుకుని.. BRS పార్టీని తుడిచి వేయటము గెలుపా ఓటమా..?
8)) మధ్యప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, గోవాలలో మొత్తం అన్ని స్థానాలూ.. గుజరాత్, ఝార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒరిస్సా, కర్నాటక, అస్సాం, రాజస్థాన్ లలో అత్యధిక స్థానాలు గెలుచుకోవటం గెలుపా ఓటమా..?
9)) దేశంలో ఉన్న అన్ని రకాల పార్టీలు కలిసిపోయి సాధించిన స్థానాల (232) కన్నా బీజేపీ ఒక్కటే ఎక్కువ స్థానాలు (240) సాధించటము గెలుపా ఓటమా..?
10)) ఓటమిలో పోటీ పడుతున్న కాంగ్రెస్ కు మూడంకెల సంఖ్య రాకుండా 99 దగ్గరే మూడో సారి కూడా ఓడించటము గెలుపా ఓటమా..?
ఈ పది ప్రశ్నలకు జవాబులు దొరికితే బిజెపి ది గెలుపా ఓటమా అన్నది అర్థమయిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చేసే బురద ప్రచారం బట్టబయలు అవుతుంది.