ఒక “డమ్మీ” ని రాష్ట్రపతిగా బీజేపీ కోరుకుంటోందని పుదుచ్చేరి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. INC పుదుచ్చేరి చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ను షేర్ చేశారాయన.
అధికార బీజేపీ ఒక డమ్మీని రాష్ట్రపతిగా కోరుకుంటుంది, అదే సమయంలో వారు SC/ST కమ్యూనిటీని మోసం చేయాలనుకుంటున్నారు” అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ట్వీట్ను డిలీట్ చేసింది.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చారు కిరణ్ రిజిజు.
“కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పీఏ సంగ్మా సహా చాలా మంది గౌరవ ఎస్సీ/ఎస్టీ నాయకులను అవమానించింది. ఇప్పుడు మాజీ గవర్నర్, మాజీ మంత్రి శ్రీమతి ద్రౌపది ముర్ము జిని అవమానిస్తున్నారు, అది ఆపండి. ఆమె అంకితభావంతో ఈ స్థాయికి ఎదిగారు” అని ట్వీట్ చేశారు రిజిజు.
https://twitter.com/KirenRijiju/status/1539565068949499905?s=20&t=eHNEWAKok1oUaXxSQQMxjw
INC పుదుచ్చేరి చేసిన ఈ వ్యాఖ్య కారణంగా బీజేపీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రతిపక్షం గిరిజన సమాజాన్ని, మహిళలను అవమానించిందని అధికార పార్టీ ఆరోపించింది.