ఇన్నేళ్లు శ్రీరామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడిక అయోధ్య ట్రస్టు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విశ్వహిందూపరిషత్ మండిపడింది. ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు సంస్థ జాతీయసంయుక్త ప్రధానకార్యదర్శి రాఘవులు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మందిర ట్రస్టు కొన్న భూ లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగాయని వివరణ ఇచ్చారు.
మందిర నిర్మాణం సజావుగా సాగుతుంటే ఓర్వలేక
ఆప్, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు అర్థం లేని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన VHP , మందిర ట్రస్టు పై దేశ ప్రజలు పూర్తి విశ్వసనీయతను చాటుతూ పెద్దఎత్తున మందిర నిర్మాణానికి విరాళాలు సమర్పించారని … శ్రీరామ భక్తులు సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారీగా ఉంటుందని.. వీహెచ్పీ ప్రతినిధులు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ చెప్పారు.
ఆ విరాళాలతో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం జరుగుతోందనీ.. శ్రీరామ మందిరం భవిష్యత్ భారతావనికి ఒక స్పూర్తి కేంద్రంగా – శక్తి కేంద్రంగా మారబోతుందనీ ఆకాంక్షించారు.కొన్ని శక్తులు ఇంకా శ్రీరామ మందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామకార్యాన్ని ఆపబోరన్నారు..పలు పార్టీల ఆరోపణలు, మీడియాలో కథనాల నేపథ్యంలో తెలంగాణ వీహెచ్పీ శాఖ హైదరాబాద్ లోని ప్రాంతకార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది..ప్రచారం అవాస్తవమని స్పష్టంచేసింది.