బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ కారుపై రాళ్లదాడి జరిగింది. వైసీపీ వాళ్ల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన 1200 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పలు పార్టీల నేతలతో పాటు సత్యకుమార్ కూడా పాల్గొన్నారు.మందడంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఆయన కారుపై దుండగులు రాళ్లదాడి చేశారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాళ్లదాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/satyakumar_y/status/1641753558218579970?s=20