అంతర్జాతీయ బలహీన సంకేతాలకు తోడు, కోవిడ్ భయంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదుచేశాయి. ప్రారంభంనుంచే ప్రతికూలంగా మొదలైన మార్కెట్లు రోజంతా అదేబాటలో పయనించాయి. రూపాయి బలహీనపడడం, చమురుధరలు పెరగడం,రిలయన్స్, ఎస్బీఐ వంటివాటి షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం వంటి పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.ఇంతటి బలహీన మార్కెట్లోనూ భారత్ ఇమ్యునోలాజికల్స్, అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్స్ షేర్లు 20శాంతి పెరిగి రూ. 44.85 వద్ద అప్పర్ సర్క్యూట్ ని తాకాయి.