దేశీయ స్టాక్ మార్కె సూచీల్లో మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని ఇంట్రాడే గరిష్టాలకు చేరాయి. దీంతో సెన్సెక్స్ 60,000 మార్కుని తిరిగి అందుకుంది. నిఫ్టీ 18000 మార్కుని చేరుకుంది. అమెరికా సహా భారత్ లోనూ ద్రవ్యోల్బణం తగ్గడం సూచీల సెంటిమెంట్ ను పెంచిందంటున్నారు.రూపాయి బలపడడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది.