బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. . 49,786 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల వరకు ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. 14,712 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ .. 10 గంటల సమయానికి 120 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ ఆ తర్వాత దిగజారుతూ వచ్చి 600 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది. అమెరికా మార్కెట్లు నిన్ననష్టాల్లో ముగిసాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ దాదాపు 40 పాయింట్ల దిగువన ట్రేడ్ అయింది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు ఒత్తిడినెదుర్కొన్నాయి. విద్యుత్తు, యుటిలిటీస్, హెల్త్ కేర్ మినహా అన్ని రంగాలూ నష్టాల్లో ఉన్నాయి.