కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో గాయాలపాలైన ఆర్మీ డాగ్ జూమ్ పరిస్థితి నిలకడగా ఉంది. టెర్రరిస్టుల కాల్పుల్లో జూమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెనక కాలువిరిగింది. వైద్యులు సర్జరీ చేశారు. 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపారు. దీంతో శ్రీనగర్లోని ఆర్మీ వెటర్నరీ ఆస్పత్రిలో వైద్యబృందం జూమ్ ను జాగ్రత్తగా చూసుకుంటోంది.
https://twitter.com/Maverickmusafir/status/1579847051050745856?s=20&t=jnNVx1KBJsvGq1ewSuRvQg
అనంత్నాగ్లోని కోకెర్నాగ్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ సమయంలో జూమ్ ఉగ్రవాదులపై దాడి చేసింది .వారు ఎదురుకాల్పులు జరపగా రెండు బుల్లెట్లు దాని ఒంట్లోకి దిగాయి. గాయాలైనా వెనక్కి తగ్గక తనపని చేసింది. ఉగ్రవాదులను కనిపెట్టి, మట్టుబెట్టడంలో ఆ శునకం ప్రదర్శించిన ధైర్యసాహసాలు తెలుపుతూ చినార్ కార్ప్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దక్షిణ కాశ్మీర్లోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి అందగానే…భద్రతాదళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
సోమవారం ఉదయం ఆర్మీ ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిలోకి ‘జూమ్’ ను పంపారు. జూమ్ ఆర్మీలో కఠినమైన శిక్షణ పొందిన, నిబద్ధతతో కూడిన శునకం. తీవ్రవాదులను గుర్తించడం, మట్టుబెట్టడం వంటి వాటిపైనే దానికి శిక్షణ ఇచ్చింది ఆర్మీ.
గాయాలపాలైనా తీవ్రవాదులతో పోరాడుతూనే ఉంది…వారిని మట్టుపెట్టడంలో సైన్యానికి తోడ్పాడునందించింది. పట్టుబడిన, హతమైన ఉగ్రవాదులు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు.