బ్యాంకుకు సెక్యూరిటీగా ఉంటాడనుకుంటే లూటీ చేశాడో వ్యక్తి. ఈ సంఘటన చంఢీఘర్లో చోటుచేసుకుంది. స్థానికంగా సెక్టార్ 34ఏ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకులో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సమయంలో బ్యాంకుకు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తే.. ఆ బ్యాంకును లూటీ చేశాడు. ఏకంగా రూ.4.04 కోట్లను దోచుకెళ్లాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1381313378224799746