ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ అరెస్టుపై పంజాబ్ & హర్యానా హైకోర్టు స్టే విధించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పలు ఆరోపలు చేశారు విశ్వాస్. కేజ్రీకి ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఆవ్యాఖ్యలపై పోలీసులు ఆయన్ని విచారణకు పిలిచారు. ఏప్రిల్ 20న పంజాబ్ పోలీసులు ఘజియాబాద్ లోని కుమార్ విశ్వాస్ ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం తర్వాత, పంజాబ్ పోలీసులు తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కుమార్ పిటిషన్ను వేశారు. తనపై జరిగిన ఇలాంటి బలవంతపు చర్యపై స్టే విధించాలని కోరారు. ఈ కేసులో విశ్వాస్ అరెస్టుపై స్టే విధించిన జస్టిస్ అనూప్ చిట్కార ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఆ ఎఫ్ఐఆర్ దుర్మార్గమైన ఉద్దేశ్యంతో, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడం వల్లే జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై తాను చేసిన ప్రకటనల తర్వాత కావాలనే వక్రబుద్ధితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు విశ్వాస్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 16 నుంచి 19 మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు తనపై ఏప్రిల్ 12న ఎఫ్ఆర్ఐ నమోదైంది. విశ్వాస్ ప్రకటనలు పంజాబ్ అంతటా అశాంతి, మతపరమైన అస్థిరతను సృష్టించగలవని ఫిర్యాదుదారు నరీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిపై దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, పోలీసులు తనకు ఎఫ్ఐఆర్ అందించకుండానే పంజాబ్ పోలీసు అధికారుల బృందాన్ని తన నివాసానికి పంపారని.. అది తన ప్రాథమిక హక్కు స్వేచ్ఛను చట్టవిరుద్ధంగా ఉల్లంఘించే చర్య’ అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఖలిస్తానీ వేర్పాటువాదులతో కలిసి పంజాబ్లో అధికారం కోసం కేజ్రీవాల్ రాజీ పడుతున్నారని కుమార్ విశ్వాస్ హైలైట్ చేశారు. కేజ్రీవాల్ ఒక సమయంలో “నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) మొదటి ప్రధానమంత్రిని అవుతాను” అని పేర్కొన్నారని.. అధికారం కోసం తపన పడుతున్న కేజ్రీవాల్ మనసులో వేర్పాటువాదం లోతుగా పాతుకుపోయిందని విశ్వాస్ ఆరోపించారు.
కుమార్ విశ్వాస్ ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత, AAP నాయకుడు రాఘవ్ చద్దా మీడియాకు బెదిరింపు ఇచ్చారు, విశ్వాస్ చేసిన ఆరోపణలను కవర్ చేసినందుకు మీడియా సంస్థలపై AAP చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. కుమార్ విశ్వాస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత రాఘవ్ చద్దా మధ్య మాటల యుద్ధం మరింత పెరిగి పంజాబ్ పోలీసులు విశ్వాస్ తలుపు తట్టేంత వరకు దారితీసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)