అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధికారిక పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ గెస్ట్ హౌసుల్లోనే బస చేయాలని, బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని రాష్ట్రమంత్రులకు సూచించారు. ఇక హోటళ్లలో కాక ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బసచేయాలనే నిబంధన మంత్రులతో పాటు అధికారులకూ వర్తిస్తుందని ఓ సమావేశం వేదిగ్గా యోగీ స్పష్టం చేశారు.
అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని చెబ్తూ సమయానికి రావాలని సూచించారు. లంచ్ టైం అరగంటకు మించి తీసుకోవద్దనీ ఆదేశించారు.
విధులకు ఆలస్యంగా హాజరయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న యోగీ…ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపే సిటిజన్స్ చార్టర్ను అమలు చేస్తామన్నారు. పనుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ ఫైలునైనా సరే మూడు రోజులు మించి పెండింగ్ లో ఉంచడానికి వీల్లేదని చెప్పారు.
ఇక శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టనున్నారు యోగీ. రమజాన్ సమయంలో నవమి వేడుకలు వచ్చినా ఎలాంటి అల్లర్లు జరగలేదని చెప్పుకొచ్చారు. యూపీలో హింసకు తావేలేదన్నారు. శ్రీరామనవమి సందర్భంగా… గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)