మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఒక మసీదులో శివుడు, గణేశుడి విగ్రహాలున్నాయని పురావస్తుశాఖ నిర్ధారించింది. మహామండలేశ్వర్, అఖండ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు అతులేశానంద జీ మహారాజ్ నివేదించిన కొన్ని రోజుల తర్వాత పురావస్తు శాఖ ఇప్పుడు నిజంగానే శివాలయం ఉందని ధృవీకరించింది. మసీదులో సేకరించిన అవశేషాలను, మసీదు లోపల చిత్రాలను పురావస్తుశాఖ చూపించింది. జ్ఞానవాపి మసీదు చర్చ ఇప్పటికే దుమారం లేపుతున్న వేళ ఇది వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ విక్రమ్ యూనివర్శిటీ పురావస్తు విభాగానికి చెందిన ప్రొఫెసర్ రామన్ సోలంకి మీడియాతో మాట్లాడుతూ, “వెయ్యేళ్ల క్రితం భోజరాజు కాలంలో అనేక దేవాలయాలు ఉండేవి. ఒక విశ్వవిద్యాలయం కూడా ఉండేది… ఈ శివాలయం అందులో భాగమే. విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ శివాలయంలో పూజించేవారు, తర్వాత దానిని కూల్చివేశారు” అని చెప్పారు.
అంతకుముందు…ఉజ్జయిని మసీదులో పురాతన శివాలయం, గణేష్ విగ్రహం ఉందని ఆవాన్ అఖారాకు చెందిన అతులేశానంద్ జీ మహారాజ్ కొత్త చర్చను ప్రారంభించారు. ఈ మసీదు డాని గేట్ వద్ద ఉంది. అతులేశానంద 2007లో తానే స్వయంగా మసీదులోకి ప్రవేశించానని, పురాతన పరమరకల్ రాజ భోజ్ కాలం నాటి శివుడి, గణేష్ విగ్రహాలను చూశానని పేర్కొన్నారు.