నిన్న కాశి విశ్వనాథ కారిడార్ అట్టహాసంగా ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా మొదలైంది. గంగా నుంచి గర్భగుడి వరకు నిర్మించిన కారిడార్ ను మోడీ ప్రారంభించారు. అయితే ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహం ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆలయాలలో భరతమాత విగ్రహం చాలా అరుదుగా చూస్తుంటాము. నేలను కూడా తల్లిలా భావిస్తున్న గొప్ప సంస్కృతి మన దేశానిది. దీన్ని ప్రతిబింబిస్తూ ప్రసిద్ధమైన కాశి విశ్వనాథాలయం ముందు భరతమాత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.