వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింది. ఢిల్లీ చేరుకున్న విగ్రహాన్ని అక్కడినుంచి ర్యాలీగా కాశీ తీసుకెళ్తున్నారు. ఈనెల 15 యోగీ ఆదిత్యనాథ్ చేతులమీదుగా విగ్రహప్రతిష్ట జరగనుంది.
నాలుగురోజులపాటు సాగే విగ్రహయాత్రలో ముందు డిల్లీనుంచి అలీగఢ్ తీసుకెళ్తారు. అక్కడినుంచి కనైజ్, అయోధ్య మీదుగా కాశీ చేరుస్తారు. అన్నపూర్ణాదేవి విగ్రహం ఎత్తు 17 సెమీ, వెడల్పు 9 సెమీ. భారత్ కు చెందిన పలు దేవతామూర్తుల విగ్రహాలు 157 దేశాల్లో గుర్తించారు. వాటిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఆయాదేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.