పెట్రో ధరలపై రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయి.. కేంద్రంతో చర్చించాల్సిందే.
https://twitter.com/ANI/status/1367776815964594182
పెట్రోల్ ధరల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిందేనని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజల్లో ఆందోళన కలుగుతుండటంతో కేంద్రమంత్రి స్పందించారు. పెట్రోల్,డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వంతో పాటుగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నాయన్నారు. ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని.. అవసరమైతే కేంద్రంతో కూడా చర్చలు జరపాలని సూచించారు. పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల అనేది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని.. దీనిలో ఒక్క కేంద్ర ప్రభుత్వమే పన్నులు వేస్తుందని అనుకోవద్దని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. పెట్రోల్పై వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వెళ్తుందని.. దీనిపై కేంద్ర,రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం అత్యవసరమని అన్నారు.