రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్లో ముగింపు సభ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని…యాత్ర ఊహించనిదానికన్నా విజయవంతమైందని రాహుల్ అన్నారు. జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని…. ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని రాహుల్ అన్నారు. కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. సోదరి ప్రియాంకతో కలిసి మంచులో ఆటలాడుతూ గడిపాడు రాహుల్. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర…5 నెలలపాటు 4 వేల కి.మీ మేర ఈ యాత్ర కొనసాగింది. ‘మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో ఈ యాత్ర ప్రారంభమైంది. కశ్మీర్లోని లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్ర ముగిసింది.