మాతృశక్తి గౌరవాన్ని చాటుతూ, వారి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గౌరవార్థం రాష్ట్ర మహిళలు అభినందన సభ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. చౌహాన్ను సన్మానించారు. ఈసందర్భంగా మాజీ సీఎం, కేంద్రమంత్రి ఉమాభారతిని ప్రశంసలతో ముంచెత్తారు సీఎం. అయోధ్య ఉద్యమంలో ఆమె పోరాటం, కేంద్రమంత్రిగా గంగానదీ ప్రక్షాళన, గోసంరక్షణకోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తు చేశారు. 2003లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావడం వెనక దీదీ కృషి ఎంతో ఉందన్నారు. సాధ్వీ ఉమాభారతి మొహంలో తేజస్సు, అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటాయని కొనియాడారు. వ్యాసపీఠంపై కూర్చున్న సరస్వతి ఆమె కంఠంలో కొలువుదీరందంటూ ఉమాభారతికి పాదాభివందనం చేశారు.
आदरणीय दीदी @umasribharti जी के चेहरे का तेज,वाणी का ओज अद्भुत है।ईश्वर की कृपा व दीदी के आशीर्वाद से सरकार चलाने में कभी धन की कमी नहीं आई।मातृशक्ति के सम्मान,सुरक्षा व हितों के अनुरूप आबकारी नीति लाने पर प्रदेश की बहनों की ओर से उमा दीदी ने अभिनंदन किया। https://t.co/K5trHjLNfm https://t.co/cZ8WeEixiM pic.twitter.com/lunnwDIkrn
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 11, 2023