భారత్ కు స్టార్టప్ లే వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం దాదాపు 150 స్టార్టప్ లతో ఆయన సంభాషించారు. ఇక నుంచి ప్రతీ ఏటా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డే గా జరుపుకుందామని ప్రకటించారు. దేశంలో స్టార్టప్ ల సంఖ్య 550 నుంచి 60 వేలకు చేరుకుందని ఆయన అన్నారు. ఈ దశాబ్దాన్ని ‘టెక్ కేడ్’ ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, స్టార్టప్ ఎకో సిస్టమ్ ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న మూడు ముఖ్యమైన అంశాలను మోదీ ప్రస్తావించారు. దేశంలోని స్టార్టప్ లకు ఊతమిస్తామని… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఎంటర్ ప్రైజ్ సిస్టమ్స్,స్పేస్, ఇండస్ట్రీ4.0, సెక్యూరిటీ, ఫిన్ టెక్, వ్యవసాయం, పర్యావరణం వంటి పలు రంగాలకు చెందిన 150 పైగా స్టార్టప్ ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్టార్టప్లకు మేలు చేసే విధంగా సరికొత్త విధానాలతో ముందుకు రాబోతున్నామని భవిష్యత్తులో పెద్దఎత్తున మార్పులు చూడబోతున్నారని అన్నారు.
ఆవిష్కరణలకు సంబంధించి భారత్ గ్లోబల్ ఇండెక్స్లో మెరుగుపడుతుందని మోదీ పేర్కొన్నారు. 2015లో ఈ ర్యాంకు 81వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 46వ స్థానానికి చేరిందని మోదీ అన్నారు.2013-14లో 4వేల స్టార్టప్లు మాత్రమే ఉండగా.. గతేడాది ఈ సంఖ్య 28 వేలకు చేరిందన్నారు. యువత మరిన్ని ఆలోచనలు చేసి ప్రపంచంలో భారత్ పేరును అగ్రగ్రామిగా నిలపాలని మోదీ సూచించారు.
భారతదేశంలోని ప్రజలకు సంపద, ఉద్యోగాల కల్పనను పరిశీలించాలని స్టార్టప్ ఇన్నోవేటర్లను ఆయన ప్రోత్సహించారు. “నేను మీతో నిలబడతాను, ప్రభుత్వం మీతో ఉంది మరియు దేశం మొత్తం మీకు అండగా ఉంది” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.