దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా యువత, మధ్యవయసు వారే ఎక్కువగా వైరస్ బారిన పడుతుండడంతో… మే 1నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది.
కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకాల రిజిస్ట్రేషన్ కోసం వివరాలుంచారు. ఇవాల్టి ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పినా సమయం చెప్పకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆరోగ్య సేతు అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
జనవరి 16, 2021 నుంచి తొలి దశలో కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్కు టీకాలు ఇచ్చారు. రెండో దశలో మార్చి 1, ఏప్రిల్ 1న ప్రారంభించారు. 45 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, 45 ఏళ్లు పైబడిన దేశ ప్రజలు అందరికీ రెండో దశలో కరోనా టీకాలు ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి మూడో దశలో 18 ఏళ్లు పైబడిన దేశ పౌరులు అందరికీ కోవిడ్19 టీకాలు ఇవ్వనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనా టీకాల ఉత్పత్తిదారులైన సీరం సంస్థ, భారత్ బయోటెక్ సంస్థలు ఒక్కో టీకా డోసుకు ధరలను ప్రకటించాయి.