కేంద్రంలో తిరిగి అధికారం సాధించడం కోసం పార్టీకి తిరిగి ఊపిరిపోసే దిశగా రాహుల్ గాంధీతలపెట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. కన్యాకుమారిలో కొద్దిసేపటి క్రితం మొదలైన యాత్ర కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర సాగనుంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 150 రోజులపాటు యాత్ర సాగనుంది.
నేటితో మొదలైన యాత్ర మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30తో ముగియనుంది. ఈ యాత్రలో 117 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల్లో యాత్ర సందర్భంగా వారంతా జాయినవుతారు. 12 రాష్ట్రాల్లో సాగే యాత్ర సందర్భంగా 22 సిటీలు, పట్టణాల్లో భారీ ర్యాలీలు సాగుతాయి. కొచ్చి, త్రిసూర్, నీలాంబర్ , మైసూరు, బళ్లారి, రాయచూర్, నాందేడ్ , ఇండోర్, ఉజ్జయిని, కోట, దౌస, అల్వార్ , ఢిల్లీ, అంబాలా , పఠాన్కోట్ , జమ్ము, శ్రీనగర్లలో ఈ భారీ సభలు జరుగుతాయి.
ఆయా రాష్ట్రాల్లో భారత్ కే రతన్ వంటి కార్యక్రమాలు, సంవిధాన్ బచావో యాత్రలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీకి ఖాదీ తిరంగాను అందించడంతో యాత్ర మొదలైంది. అంతకుముందు పార్టీ ఇతర నేతలు కలిసి రాగా…పాదయాత్రగా పబ్లిక్ ర్యాలీ ప్రాంతానికి చేరుకున్నారు రాహుల్. అంతకుముందే శ్రీపెరంబుదూరులోని రాజీవ్ గాంధీ స్మారకస్థలం దగ్గర పార్టీ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. అటు నుంచి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ విగ్రహం, కామరాజ్ మెమొరియల్ ను కూడా సందర్శించారు కాంగ్రెస్ యువనేత
LIVE: Shri @RahulGandhi flags off and joins Bharat Jodo Yatra in Kanyakumari. #BharatJodoBegins https://t.co/lpRsDyKWun
— Congress (@INCIndia) September 7, 2022