అమర్ నాథ్ యాత్రికులకు దేవస్థాన బోర్డు శుభవార్త తెలిపింది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవుతోందని చెప్పింది. అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా యాత్ర కు సంభందించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. జూన్ 30న యాత్రను ప్రారంభించి.. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజు యాత్రను ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశమివ్వనున్నారు. యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న ప్రారంభమవుతుందని తెలిపారు. కోవిద్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. రెండేళ్లు కరోనా విజృంభణ కారణంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు.. కానీ ఈసారి కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)