తమిళనాడుసీఎం పదవి చేపట్టినదగ్గర్నుంచీ తనదైన ముద్ర వేసుకుంటున్నారు స్టాలిన్. ప్రజలకు అతిచేరువగా వెళ్తూ వాళ్ల ఇబ్బందుల్ని తెలుసుకుని అక్కడికక్కడే తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించారాయన. తన తండ్రి, మాజీ సీఎం కరుణానిధి, డీఎంపే వ్యవస్థాపకుడు అన్నాదురైలకు నివాళులర్పించేందుకు మెరీనా బీచ్ కు బస్సులో సాధారణ ప్రయాణీకులతో కలిసి వెళ్లారు. చెన్నై సిటీ బస్సులో ఎక్కిన స్టాలిన్ ను చూసి బస్సుల్లోని ప్రయాణికులు అవాక్కయ్యారు. అసలు సీఎంనా అని తెల్లబోయి చూశారు. కాసేపు అలాగే తమ ప్రియతమ నాయకుడిని చూస్తుండిపోయారు. ఇక, బస్సులో నిలబడి కొద్దిదూరం జర్నీ చేసిన స్టాలిన్.. ప్రయాణికులు, కండక్టర్ తో ముచ్చటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
#Watch | Tamil Nadu Chief Minister MK Stalin Boards Bus, Speaks To People About 1 Year Of Governance https://t.co/Us0XdvHhl0
(Video: ANI) pic.twitter.com/YmJOAS4QiI
— NDTV (@ndtv) May 7, 2022