తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు.రాజ్ భవన్లో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులూ ప్రమాణం చేశారు. అంతకుముందు స్టాలిన్ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ కురువృద్ధులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య, సీపీఐ సీనియర్ నేత ఆర్.నల్లకన్ను, ఎంజీఆర్ కళగం అధ్యక్షుడు, సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ ఇళ్లకూ వెళ్లి వాళ్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ 133 స్థానాలను డీఎంకై కైవసం చేసుకుంది.