పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది.
ఈ విషాదకరమైన సంఘటన సింధ్ ప్రభుత్వం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుకోరుతూ మెడికల్ ఎంక్వైరీ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
తార్పార్కర్ జిల్లాలోని ఒక సుదూర గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ, మొదట తన ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) వెళ్ళింది, అక్కడ మహిళా గైనకాలజిస్ట్ అందుబాటులో లేదు. అనుభవం లేని సిబ్బంది ఆమెకు వైద్య చికిత్స చేయబోయి బిడ్డ ప్రాణంతీశారు. రహీల్ సికందర్ జంషోరోలోని లియాఖత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ (LUMHS) గైనకాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు.
ఆర్హెచ్సి సిబ్బంది ఆదివారం నిర్వహించిన శస్త్రచికిత్సలో తల్లి కడుపులో ఉన్న శిశువు తలను నరికి లోపలే ఉంచినట్లు ఆయన తెలిపారు.
మహిళ ప్రాణాపాయ పరిస్థితిని గమనించి, ఆమెను మిథిలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమెకు చికిత్స చేయడానికి సౌకర్యాలు లేవు. చివరికి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను LUMHSకి తీసుకువచ్చారు, అక్కడ శిశువు మిగిలిన శరీరాన్ని తల్లి గర్భం నుంచి బయటకు తీసి ఆమె జీవితాన్ని కాపాడారని ఆయన చెప్పారు.
భయంకరమైన తప్పిదం కారణంగా సింధ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జుమాన్ బహోటోను ఈ కేసుపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది. అంతేకాదు కొందరు ఆమె ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేశారు. వారిపైనా చర్యలుంటాయని అధికారులు తెలిపారు.